అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే ఫాల్గుణ

ABN , First Publish Date - 2021-06-25T05:50:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరే విధంగా చూడాలని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే ఫాల్గుణ
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెలే ఫాల్గుణ


ముంచంగిపుట్టు, జూన్‌ 24: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరే విధంగా చూడాలని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మండల సర్పంచ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరే విధంగా చూడాలన్నారు.  ఈ  రెండేళ్లలో పలు గ్రామాలకు రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.  దశలవారీగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి చేరిన సర్పంచ్‌లకు పార్టీ కండువాలను వేసి ఎమ్మెల్యే ఫాల్గుణ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జె. సుభద్ర, మల్లికార్జున్‌, మత్స్యలింగం, గాసీరావు, రమేశ్‌, ఎండీ సులేమాన్‌, మణి, బాబూరావు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-25T05:50:21+05:30 IST