మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మిథున్‌

ABN , First Publish Date - 2021-10-20T05:19:20+05:30 IST

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మనపలె జడ్పీహైస్కూల్‌ ఆవరణలో డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు.

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మిథున్‌
నిమ్మనపల్లెలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న మిథున్‌

నిమ్మనపల్లె/ రామసముద్రం, అక్టోబరు 19: మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మనపలె జడ్పీహైస్కూల్‌ ఆవరణలో డ్వాక్రా సంఘాలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మా ట్లాడుతూ... మండలంలోని 500 డ్వాక్రా సంఘాలకు రూ.5.20 కోట్లను జమచేసిందన్నారు. ఎంపీపీ నరసింహులు, జడ్పీటీసీ సభ్యురాలు ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. రామస ము ద్రం జూనియర్‌ కళాశాల ఆవరణలో ఎంపీ మిథున్‌, ఎమ్మెల్యే నవాజ్‌బాషా చేతుల మీదుగా 886 సంఘాలకు రూ.6.60 కోట్ల ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది.  ఎంపీపీ కుసుమకుమారి, జడ్పీటీసీ సభ్యుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:19:20+05:30 IST