ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాజప్ప

ABN , First Publish Date - 2020-09-24T08:09:12+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సుధా

ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాజప్ప

పెద్దాపురం, సెప్టెంబరు 23: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సుధా కాలనీలోని క్యాంపు కార్యాయలంలో బుధవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలు, రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయని పైగా నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నరకాలం పూర్తి కావస్తున్నా నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి పనులు ప్రార ంభం కాలేదన్నారు. ఈ విషయాలన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.


కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని టీడీపీ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో టీడీపీ మండలాధ్యక్షుడు కొత్తిం వెంటక శ్రీనివాసరావు, గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని, మాజీ ఎంపీపీ గుడాల రమేష్‌, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, మహారాణీ సత్రం మాజీ చైర్మన్‌ తూతిక రాజు, టీడీపీ పట్టణా ధ్యక్షుడు రంధి సత్యనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు,  వైస్‌ చైర్మన్‌ కొరిపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T08:09:12+05:30 IST