శ్రీశైలంలో గోపూజ

ABN , First Publish Date - 2022-08-20T06:03:34+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం గోకులాష్టమిని పురస్కరించుకుని దేవస్థానం ఆలయప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజను నిర్వహించింది.

శ్రీశైలంలో గోపూజ
గోపూజలో పాల్గొన్న ఈవో లవన్న

శ్రీశైలం, ఆగస్టు 19: శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం గోకులాష్టమిని పురస్కరించుకుని దేవస్థానం ఆలయప్రాంగణంలోని శ్రీగోకులంలో గోపూజను నిర్వహించింది. ఇందులో భాగంగా శ్రీగోకులంలోని 5 గోవులకు, 5 ఆవుదూడలకు శాస్త్రోక్తంగా అర్చకులు విశేష పూజలను జరిపారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు పూజా సంకల్పాన్ని పఠించారు. తరువాత మహాగణపతికి పూజలు నిర్వహించి అనంతరం శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తర మంత్రంతోనూ, గోవులకు షోడశో పచారాలతో పూజాదికాలు, వేదపారాయణాలు  జరిపించారు. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ఈవో ఎస్‌.లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T06:03:34+05:30 IST