మంచిపనులు చిరస్థాయిగా నిలుస్తాయి
ABN , First Publish Date - 2022-05-25T05:44:40+05:30 IST
మంచిపనులు చిరస్థాయిగా నిలుస్తాయి
కడ్తాల్, మే 24: జీవిత కాలంలో చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలుస్తాయని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. కడ్తాల మాజీ సర్పంచ్ వేణుగోపాల్ తల్లి తిరునగరి భారతమ్మ సంస్మరణ కార్యక్రమాన్ని మంగళవారం కడ్తాల మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని భారతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. భారతమ్మ కుమారుడు వేణుగోపాల్, శ్రీధర్, రఘురాములను పరామర్శించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు జర్పుల దశరథ్నాయక్, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, గంప వెంకటేశ్, గూడూరు శ్రీనివా్సరెడ్డి, భాస్కర్రెడ్డి, హన్మానాయక్, రామకృష్ణ, లాయక్అలీ, యాట నర్సింహ, బీక్యానాయక్, మల్యానాయక్, మహేశ్, రవీందర్రెడ్డి, జంగారెడ్డి, జహంగీర్, నరేశ్నాయక్, సురేందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, చెన్నకిషన్రెడ్డి, నరేందర్రెడ్డి ఉన్నారు.