Hyderabad ‘మెట్రో’ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
ABN , First Publish Date - 2021-09-06T16:33:50+05:30 IST
Hyderabad ‘మెట్రో’ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
హైదరాబాద్ సిటీ : మెట్రోరైలు రాకపోకల సమయాన్ని మరికొంత పొడిగించారు. ఇప్పటివరకు ఉదయం 7.10 నుంచి రాత్రి 9.45 గంటల వరకు నడిచిన రైళ్లను అదనంగా మరో గంటన్నరపాటు పెంచారు. ఆయా కారిడార్లలో ఉదయం 7 గంటలకు బయలుదేరిన రైళ్లు రాత్రి 11.15 వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు టర్మినల్ స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 వరకు చివరి స్టేషన్కు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. పెంచిన వేళలు సోమవారం నుంచి అమలుకానున్నాయని పేర్కొన్నారు.