కంట్లో కారం చల్లి.. పుస్తెల తాడు చోరీ
ABN , First Publish Date - 2021-04-10T05:41:39+05:30 IST
ఓ వృద్ధురాలి కంట్లో కారం చల్లి బంగారు పుస్తెల తాడును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన మెండోర శుక్రవారం చోటు చేసుకుంది.
మెండోర, ఏప్రిల్9: ఓ వృద్ధురాలి కంట్లో కారం చల్లి బంగారు పుస్తెల తాడును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన మెండోర శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు కొప్పెల లింగవ్వ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగవ్వ భర్త ముత్తెన్న తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉన్నట్లు గమనించిన దుండుగులు ఇంట్లోకి చొరబడ్డారు. వృద్దురాలి కంట్లో కారం చల్లి రెండు తులాల బంగారు పెస్తెల తడు లాక్కోని అక్కడి నుంచి పరారయ్యారని వృద్ధురాలు కన్నీరు మున్నీరయ్యింది.