వకుళమాత ఆలయ గర్భగుడికి బంగారు తాపడం
ABN , First Publish Date - 2021-02-25T08:01:02+05:30 IST
పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయ గర్భగుడికి బంగారు తాపడం పనులను బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.
పనులను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి రూరల్, ఫిబ్రవరి 24: పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయ గర్భగుడికి బంగారు తాపడం పనులను బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తిచేసి, భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. అనంతరం వకుళమాత ఆలయ సమీపంలో సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న 27 అడుగుల అభయాంజనేయస్వామి వారి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు అరుణ్ మాకిరెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.