బంగారు హారం సమర్పణ

ABN , First Publish Date - 2022-08-14T05:46:22+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటకకు చెందిన ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరామ్‌ అనే భక్తుడు రూ.1.56 కోట్లతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు.

బంగారు హారం సమర్పణ
బంగారు హారాన్ని అందజేస్తున్న భక్తుడు ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరామ్‌

మంత్రాలయం, ఆగస్టు 13: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి కర్ణాటకకు చెందిన ఎంఎస్‌ఆర్‌ పట్టాభిరామ్‌ అనే భక్తుడు రూ.1.56 కోట్లతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు. శనివారం రాఘవేంద్రస్వామి 351వ ఆరాధనోత్సవాల్లో మధ్యారాధనలో భాగంగా ఊంజల మండపంపై రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న పట్టాభిరామ్‌ బంగారు హారాన్ని పీఠాధిపతికి అందజేశారు. అలాగే పీఠాధిపతి పాదాలకు భక్తులు సమర్పించిన నిధులు రూ.కోటితో నవ వైఢూర్యాలు, పచ్చవజ్రాలతో పొదిగిన మూడు హారాలను తయారు చేయించి మూల రాములకు అలంకరణ చేశారు. అదే విధంగా 350 కేజీల వెండితో మూల రాములకు వెండి మండపం, మూల బృందావననానికి బంగారు నవరత్నాల కవచాన్ని తయారు చేయిస్తున్నామని తెలిపారు. విరాళం ఇచ్చిన దాతలకు టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్‌బాబుకు మెమెంటో, శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. 

Updated Date - 2022-08-14T05:46:22+05:30 IST