రాష్ట్రస్థాయి బీచ్ రెజ్లింగ్ పోటీల్లో జిల్లాకు బంగారు పతకాలు
ABN , First Publish Date - 2021-10-20T05:20:03+05:30 IST
విశాఖపట్నంలో ఏపీ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీచ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న ఇరువురు బంగారు పతకాలు సాధించి నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సమరనాథరెడ్డి, కె.గణేష్లు తెలిపారు.
కడప (మారుతీనగర్), అక్టోబరు 19: విశాఖపట్నంలో ఏపీ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీచ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్న ఇరువురు బంగారు పతకాలు సాధించి నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సమరనాథరెడ్డి, కె.గణేష్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న కె.సాయిప్రతా్పరెడ్డి (80 కెజి), కె.వి.శివతరుణ్ (90 కె.జి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, మహిళా విభాగంలో సి.కీర్తన (వెండి), సి.రేణుక (కాంస్యం) సాధించారన్నారు. ఇదిలా వుండగా బంగారు పతక విజేతలు నవంబరు 1, 2, 3, తేదీల్లో హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.