Perambur: కవరింగ్ నాణేలిచ్చి ఓట్లు వేయించుకున్నారు!
ABN , First Publish Date - 2021-10-12T14:58:31+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రజలకు కవరింగ్ నాణేలిచ్చి ఓట్లు పొందిన ఘటన కలకలం రేపింది. స్థానిక సంస్థల రెండవ విడత ఎన్నికల్లో గత శనివారం కుండ్రత్తూర్ యూనియన్
పెరంబూర్(చెన్నై): స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రజలకు కవరింగ్ నాణేలిచ్చి ఓట్లు పొందిన ఘటన కలకలం రేపింది. స్థానిక సంస్థల రెండవ విడత ఎన్నికల్లో గత శనివారం కుండ్రత్తూర్ యూనియన్ కోలుమణివాక్కం పంచాయతీ అధ్యక్షుడు, వార్డు సభ్యులకు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు, తమ పార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేయాలని కోరుతూ బంగారు నాణేలు పంచారు. అనంతరం వాటిని కుదవ అంగడి తీసుకెళ్లిన కొందరితో అవి కవరింగ్ నాణేలుగా దుకాణ యజమాని చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. ఎన్నికల ముందు రోజు పంచని నేతలు, పోలింగ్ కేంద్రానికి ప్రజలు వెళ్లే సమయంలో ఈ నాణేలు పంపిణీ చేయడంతో తామే గెలుస్తామని అభ్యర్ధులు సంబరపడుతుండగా, నేతలు చేసిన పనికి విస్తుబోవడం గ్రామస్తుల పని అయింది.