చికిత్స పొందుతూ మహిళ మృతి.. చేతికి ఉన్న బంగారు గాజు మాయం
ABN , First Publish Date - 2020-07-06T17:27:27+05:30 IST
చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ బంగారు గాజు మాయమైన ఘటన కాచిగూడ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది.
ఆస్పత్రి సిబ్బందిపై కేసు
బర్కత్పుర, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ బంగారు గాజు మాయమైన ఘటన కాచిగూడ పోలీ్సస్టేషన్ పరిధిలో జరిగింది. కుత్బిగూడలో ఉంటున్న అకేరా పురోహిత్ భార్య పుష్పాదేవి(69) బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను బర్కత్పురలోని బ్రిస్టల్ కోన్ ఆస్పత్రిలో ఈనెల 3వ తేదీన చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. మృతదేహాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఎడమచేతికి ఉన్న రెండు తులాల బంగారు గాజు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. వారు తమకేమీ తెలియదని చెప్పడంతో మృతురాలి కుమారుడు ముఖేష్ పురోహిత్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.