ఎడ్ల కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

ABN , First Publish Date - 2022-05-20T05:17:05+05:30 IST

: వ్యవ సాయ పనుల నిమిత్తం ఎడ్లను కొనడానికి ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన సిరికొండ మండలంలో చోటుచేసు కుంది.

ఎడ్ల కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి

నేరడిగొండ/ సిరికొండ, మే 19 : వ్యవ సాయ పనుల నిమిత్తం ఎడ్లను కొనడానికి ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన సిరికొండ మండలంలో చోటుచేసు కుంది. గ్రామస్థులు,  నేరడిగొండ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండలం సుంకిడి గ్రామానికి చెందిన రాథోడ్‌ సుభాష్‌(38) వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లను కొనడానికి అదే గ్రామానికి చెందిన జాదవ్‌ కిషన్‌(56)తో కలిసి బోథ్‌ మండలం కుచిర్యాల గ్రామంలోని తన బంధువుల ఇంటికి బుధవారం సా యంత్రం బయలుదేరారు. అక్కడే రూ.32 వేలకు రెండు ఎడ్లను కొనుగోలు చేశారు. ఇంటికి తిరిగి వెళతామనే క్రమంలో బంధువులు రాత్రి ఇక్కడే ఉండి గురువారం ఉ దయం వెళ్లాలని కోరారు. అయినా వారి మాట వినకుండా రాత్రి 9 గంటల సమ యంలో అక్కడి నుంచి బయలుదేరారు. 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై నేరడి గొండ మండలం కుప్టి గ్రామ సమీపంలోని వంతెనపైకి రాగానే రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వారి ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాథోడ్‌ సుభాష్‌ భార్య, ఇ ద్దరు కుమారులున్నారు. జాదవ్‌ కిషన్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు న్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నేరడిగొండ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-05-20T05:17:05+05:30 IST