అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

ABN , First Publish Date - 2020-11-01T10:21:33+05:30 IST

పట్టణంలోని నిడుబ్రోలులో అనుమానాస్పదస్థితిలో తమనం సంతోషకుమారి (22) మృతిచెందింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

పెళ్లయిన రెణ్ణెల్లకే సంతోషకుమారి విషాదాంతం



పొన్నూరు, అక్టోబరు 31: పట్టణంలోని నిడుబ్రోలులో అనుమానాస్పదస్థితిలో తమనం సంతోషకుమారి (22) మృతిచెందింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. మునిపల్లె గ్రామానికి చెందిన సంతోషకుమారినితో నిడుబ్రోలు చెందిన దొనేపూడి సురేష్‌బాబు అలియాస్‌ వికాస్‌కు రెణ్ణెల్ల క్రితం వివాహమైంది. శనివారం తెల్లవారుజామున మునిపల్లెలో పాస్టర్‌గా పనిచేస్తున్న తిమోతికి సంతోషకుమారి ఆరోగ్యం బాగాలేదని ఆమె భర్త సురేష్‌బాబు తెలిపాడు.  దీంతో ఆమె తల్లిదండ్రులు ఆదుర్దాగా నిడుబ్రోలు వచ్చేసరికే సంతోషకుమారి ఇంటిలో చనిపోయివుంది. మృతురాలి గొంతుపై కమిలినగాయాలు, ఎడమమణికట్టుపై గాట్లగుర్తులు ఉన్నాయి. దీంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు. తన అల్లుడు సురేష్‌బాబు, అతని తమ్ముడు గోపి కలిసి హతమార్చారని మృతురాలి తండ్రి తమనం మోహనరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ఎస్‌ఐ షేక్‌ హషీమ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Updated Date - 2020-11-01T10:21:33+05:30 IST