రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోంది
ABN , First Publish Date - 2020-11-01T10:24:22+05:30 IST
రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట, అక్టోబరు 31: రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. అమరావతి రైతుల అరెస్టును నిరసిస్తూ అమరావతి జేఏసీ తలపెట్టిన ఛలో గుంటూరు జైలు భరో కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్లకుండా నేతలను పోలీసులు కట్టడిచేశారు. ఈ మేరకు ప్రత్తిపాటి పుల్లారావును హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులను భేషరతుగా విడుదల చేసి అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి రాజధాని, పోలవరం రెండింటినీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందన్నారు. పేద ప్రజలకు పూర్తయిన ఇళ్లను కూడా అందించి వారి సొంతింటి కలను సాకారం చేయలేదన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. కాగా అర్బన్ ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రత్తిపాటి ఇంటి ఎదుట బందోబస్తు నిర్వహించారు.