గ్యాస్‌ డెలివరీ బాయ్‌పై హత్యాయత్నం

ABN , First Publish Date - 2020-10-28T10:33:23+05:30 IST

స్థానిక నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఏటీ అగ్రహారం నాలుగోలైనులో పులిపాక తిరుమలరావు(40) అనే గ్యాస్‌ డెలివరీ బాయ్‌పై హత్యాయత్నం జరిగింది.

గ్యాస్‌ డెలివరీ బాయ్‌పై హత్యాయత్నం

 అరగంటకు పైగా 108 కోసం ఎదురుచూపు


గుంటూరు, అక్టోబరు 27: స్థానిక నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఏటీ అగ్రహారం నాలుగోలైనులో పులిపాక తిరుమలరావు(40) అనే గ్యాస్‌ డెలివరీ బాయ్‌పై హత్యాయత్నం జరిగింది. నగరంపాలెం సీఐ మల్లిఖార్జునరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... తిరుమలరావు మూడేళ్లుగా గ్యాస్‌డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు మద్యం సేవించే అలవాటు ఉంది. మంగళవారం కంకరగుంట గేటు వద్ద ఉన్న వైన్‌షాపులోమద్యం కొనుగోలు చేసి అంకమ్మనగర్‌ రెండో లైనులోని పాడుబడిన ఇంటిలో తాగుతున్నాడు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆరోగ్యరాజు అనే వ్యక్తి తిరుమలరావును బీరు సీసాతో పొడిచినట్లు సమాచారం వచ్చిందని సీఐ తెలిపారు. తిరుమలరావు తీవ్ర గాయాలతో నడుచుకుంటూ ఏటీ అగ్రహారం నాలుగోలైనులోని బోరింగ్‌పంపు సెంటర్‌ వద్దకు చేరుకొని అక్కడ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే 108కు ఫోన్‌ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్‌ రాలేదు. చివరకు నగరంపాలెం సీఐ మలికార్జునరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే ఘటనా స్థలానికి వచ్చి గాయపడిన తిరుమలరావును జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడు ఆరోగ్యరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-10-28T10:33:23+05:30 IST