ఆర్టీసీ బస్టాండ్లో దోపిడీ
ABN , First Publish Date - 2020-10-28T10:34:36+05:30 IST
ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని దోపిడీ చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వేజెండ్ల కొండయ్య తన కుమార్తెకు ఆపరేషన్
గుంటూరు (కార్పొరేషన్), అక్టోబరు 27 : ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని దోపిడీ చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వేజెండ్ల కొండయ్య తన కుమార్తెకు ఆపరేషన్ చేయించే నిమిత్తం గుంటూరుకు వచ్చాడు. తనతోపాటు సంచిలో రూ.2.50 లక్షల నగదును తీసుకువచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దిగుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చేతిలో సంచి లాక్కుని అక్కడి నుండి ఉడాయించాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు నేరుగా పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.