మెట్ట రైతులకు ఉచితంగా బోర్వెల్
ABN , First Publish Date - 2020-09-29T10:48:54+05:30 IST
రాష్ట్రంలో మెట్ట భూముల్లో వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా సాగునీరు అందించడమే..
గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మెట్ట భూముల్లో వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు.
కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు విడదల రజని, మహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబు, కాసు మహేష్రెడ్డి, కిలారి రోశయ్య, నంబూరి శంకరరావు, మాజీ ఎంపీ వేణుగోపాల్రెడ్డి, జేసీ(ఆసర) కే శ్రీధర్రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పోలీసు పరేడ్గ్రౌండ్స్లో లాంఛనంగా జిల్లాస్థాయి వైఎస్ఆర్ జలకళ ప్రారంభోత్సవం జరిగింది. బోర్ రిగ్గు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.