నిలకడగా.. కరోనా
ABN , First Publish Date - 2020-09-28T11:04:01+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగానే కొనసాగుతోన్నది. ఆదివారం ఉదయం వరకు అందిన 6,564 శాంపిల్స్ ఫలితాల్లో 535 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
తాజాగా 535 మందికి పాజిటివ్
జిల్లాలో మరో ఐదుగురి మరణం
గుంటూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగానే కొనసాగుతోన్నది. ఆదివారం ఉదయం వరకు అందిన 6,564 శాంపిల్స్ ఫలితాల్లో 535 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 54,863 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. అలానే మరో ఐదుగురు ఆదివారం చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 582కి పెరిగింది.
ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం 44,774 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 9,507(17.33 శాతం) మంది కొవిడ్తో పోరాడుతున్నారు. కొత్తగా 5,062 మంది శాంపిల్స్ని టెస్టింగ్ నిమిత్తం సేకరించారు. కాగా గుంటూరు నగరంలో ఆదివారం వరకు నమోదైన పాజిటివ్ కేసులతో ఇప్పటివరకు 15,254 మంది కొవిడ్ బారిన పడ్డారు. జిల్లాలో రికవరీ రేటు 81.61 శాతానికి పెరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలానే ప్రతీ 10 లక్షల మంది జనాభాలో ఇప్పటివరకు 1,05,510 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కొత్తగా గుంటూరు నగరంలో 86, తెనాలి - 61, రేపల్లె - 35, తాడికొండ - 34, పెదకాకాని - 23, సత్తెనపల్లి - 18, మంగళగిరి - 11, తాడేపల్లి - 12, తుళ్లూరు - 10, దాచేపల్లి - 12, నాదెండ్ల - 21, నరసరావుపేట - 42, నకరికల్లు - 10, శావల్యాపురం - 18, బాపట్ల - 13, పొన్నూరు - 23, చుండూరులో 11 కేసులు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో మరో 95 మందికి పాజిటివ్ వచ్చింది.