జ్ఞానమూర్తి ఆదిశంకరుడు
ABN , First Publish Date - 2021-05-18T04:13:08+05:30 IST
సర్వ మానవాళికి విజ్ఞానరాశులు ప్రవచన చేసిన జ్ఞానమూర్తి ఆదిశంకరాచార్యుడు అని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు.
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
పెందుర్తి, మే 17: సర్వ మానవాళికి విజ్ఞానరాశులు ప్రవచన చేసిన జ్ఞానమూర్తి ఆదిశంకరాచార్యుడు అని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. రుషికేశ్లోని శారదా పీఠం శాఖలో సోమవారం ఆదిశంకరాచార్యుని జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యుల విగ్రహానికి పీఠాధిపతి ఆరాధన చేశారు. అలాగే చినముషిడివాడలోని శారదా పీఠంలో ఆదిశంకరాచార్యుని జయంతిని ఘనంగా నిర్వహించినట్టు పీఠం శ్రీకార్యం తెలిపింది.