ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2021-10-21T04:50:01+05:30 IST
మండలంలోని కొత్తపల్లె గ్రామ సమీపంలోగల రింగ్రోడ్డులో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రొద్దుటూరు రూరల్, అక్టోబరు 20: మండలంలోని కొత్తపల్లె గ్రామ సమీపంలోగల రింగ్రోడ్డులో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద బుధవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పాల్గొని వాల్మీకి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా వాల్మీకి సంఘం అధ్యక్షుడు బి.ఆంజనేయులు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సహకరించాలని ఎమ్మెల్యే రాచమల్లును కోరారు. ఎంపీపీ సానబోయిన శేఖర్యాదవ్, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వాల్మీకి సంఘం ప్రధాన కార్యదర్శి రామగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకులను ఎస్టీలో చేర్చాలి
వాల్మీకులను ఎస్టీలోకి చేర్చాలని వాల్మీకి సంఘం నాయకులు నల్లబోతుల నాగరాజు డిమాండు చేశారు. బుధవారం వాల్మీకి జయంతిని పురష్కరించుకుని స్థానిక ఖాదరాబాదు బైపా్సలో ఉన్న వాల్మీకి విగ్రహనికి ఆయన పూలమాల వేసి మాట్లాడారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం పట్టణ అధ్యక్షుడు ఆంజినేయులు, వాల్మీకి కుల పెద్దలు పాల్గొన్నారు.