హార్సిలీహిల్స్కు తాగునీరివ్వండి
ABN , First Publish Date - 2022-05-27T04:58:30+05:30 IST
పదేళ్లుగా హార్సిలీహిల్స్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ నివశిస్తున్నాం. ఇప్పుడు కొండపైకి తాగునీటి సరఫరాను అడ్డుకుంటున్నారు.
సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నాలో హార్సిలీహిల్స్ వాసులు
మదనపల్లె టౌన్, మే 26: పదేళ్లుగా హార్సిలీహిల్స్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ నివశిస్తున్నాం. ఇప్పుడు కొండపైకి తాగునీటి సరఫరాను అడ్డుకుంటున్నారు. దయచేసి నీటి సరఫరాకు అనుమతులు ఇవ్వండంటూ హార్సిలీహిల్స్ వాసులు కోరారు. గురువారం స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట హార్సిలీహిల్స్ వాసులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల హార్సిలీహిల్స్కు వచ్చిన కలెక్టర్ గిరీషా అక్కడ ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారన్నారు. దీంతో పాటు కొండ కింది నుంచి తాగునీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లకు పైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. మూడు రోజులుగా నీరు లేక ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. అధికారులు మాపై దయచూపి వాటర్ ట్యాంకుల రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం డీఏవో శేషయ్యకు వినతిపత్రం అందజేశారు.