హోసూరులో బాలిక కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-04-17T17:51:02+05:30 IST

క్రిష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ అయిన సంఘటన శుక్రవారం హోసూరు నగర పోలీస్‌ స్టేషన్‌ పరిధి

హోసూరులో బాలిక  కిడ్నాప్‌


హోసూరు(బెంగళూు): క్రిష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ అయిన సంఘటన శుక్రవారం హోసూరు నగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు అందించిన వివరాల మేరకు హోసూరు నగర ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక హోసూరులోని ప్రైవేట్‌ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ఈ తరుణంలో ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి బయటకెళ్లిన ఆమె తిరిగి రాలేదని, ఎక్కడ వెతికినా దొరకలేదని, హోసూరు సమీపంలోని కామన దొడ్డి గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకునిపై అనుమానం ఉందని బాలిక తల్లితండ్రులు హోసూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-04-17T17:51:02+05:30 IST