బాలిక ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-24T05:48:38+05:30 IST
బాలిక ఆత్మహత్య
నందిగామ, మే 23: తండ్రి వేధింపులు భరించలేక కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బుగ్గోనిగూడలో సోమవారం జరిగింది. బుగ్గోనిగూడకు చెందిన మొగలిగిద్ద నర్సింహకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. నర్సింహ భార్య సంవత్సరం క్రితం మృతిచెందింది. నర్సింహ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు శ్రవణ్కుమార్ సంవత్సరం నుంచి కన్హా ఆశ్రమంలో ఎలక్ట్రిక్స్టోర్ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. కూతురు మనీష అలియాస్ అనూష(16) పదవతరగతి పూర్తి చేసుకొని ఇంటివద్దే ఉంటుంది. తండ్రి నర్సింహ తరుచూ మద్యంతాగి వచ్చి పిల్లలతో గొడవపడేవాడు. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు మనీష ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో తన తండ్రి మంచివాడు కాదని రాసినట్లు సీఐ రామయ్య తెలిపారు. మృతురాలి అన్న శ్రవణ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.