టెన్త్‌లో 82 శాతం మార్కులు... విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌... కార‌ణ‌మిదే!

ABN , First Publish Date - 2020-07-01T16:15:08+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో టెన్త్ బోర్డు ఫలితాల్లో ఒక విద్యార్థినికి 82 శాతం మార్కులు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె క‌ల‌త‌చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కంట్రోల్ రూమ్‌న‌కు అందిన‌ సమాచారం మేరకు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం...

టెన్త్‌లో 82 శాతం మార్కులు... విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌... కార‌ణ‌మిదే!

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో టెన్త్ బోర్డు ఫలితాల్లో ఒక విద్యార్థినికి 82 శాతం మార్కులు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె క‌ల‌త‌చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కంట్రోల్ రూమ్‌న‌కు అందిన‌ సమాచారం మేరకు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. స్నేహితురాలిక‌న్నా త‌న‌కు త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ని ఆ విద్యా‌ర్ధిని ఆందోళ‌న‌కు లోన‌య్యింది. ఈ కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే కాన్పూర్‌లోని ధమిఖేడకు చెందిన‌ శ్రావణ్‌ కుమార్ ఒక‌ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మేనల్లుని వివాహానికి హాజర‌య్యేందుకు ఆయ‌న తన భార్యతో పాటు బిల్‌హౌర్‌కు వెళ్లారు. ఇంట్లో ఒక పెద్ద కుమారుడు రవి, కోడలు అర్చన, కుమార్తె అనిశా, చిన్న కుమారుడు అన్ష్ ఉన్నారు. అర్థరాత్రి అనిశా ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. శ్ర‌వ‌ణ్ పెద్ద కుమారుడు రవి తన‌ సోదరి ఉరివేసుకున్న విష‌యాన్ని గుర్తించాడు. వెంట‌నే ఆమెను స‌మీపంలోని ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. అక్క‌డి వైద్యులు ఆ విద్యార్థినిని ప‌రిశీలించి, మృతి‌చెందింద‌ని తెలిపారు.  

Updated Date - 2020-07-01T16:15:08+05:30 IST