గిరిజన బాలుడు అదృశ్యం
ABN , First Publish Date - 2021-06-14T04:49:53+05:30 IST
మండల పరిధిలోని సోమరాజుపల్లె గిరిజన కాలనీకి చెందిన పోట్లూరు చరణ్(7) అనే గిరిజన బాలుడు తప్పిపోయాడు.
ఇందుకూరుపేట, జూన్ 13 : మండల పరిధిలోని సోమరాజుపల్లె గిరిజన కాలనీకి చెందిన పోట్లూరు చరణ్(7) అనే గిరిజన బాలుడు తప్పిపోయాడు. ఈ మేరకు ఆదివారం బాలుడు తండ్రి వెంకట రమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 7న ఇంట్లో నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశానని, ఆచూకీ తెలిసిన వారు 94407 96321 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.