ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై విమానంలో రెస్టారెంట్

ABN , First Publish Date - 2022-02-21T15:08:34+05:30 IST

ఘజియాబాద్ నగరంలో ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వే పక్కన విద్యుత్ దీపాల వెలుగుల్లో ఓ విమానం ప్రత్యక్షమైంది...

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై విమానంలో రెస్టారెంట్

ఘజియాబాద్: ఘజియాబాద్ నగరంలో ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వే పక్కన విద్యుత్ దీపాల వెలుగుల్లో ఓ విమానం ప్రత్యక్షమైంది. రోడ్డు పక్కనే పెద్ద విమానం కనిపించడంతో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలు సాగించే వాహనచోదకులు, ప్రయాణికులు ఈ విమానాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఘజియాబాద్ త్వరలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పాత విమానంలో వినూత్న రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది.స్క్రాప్ చేసిన విమానాన్ని తిరిగి ఉపయోగించడానికి ఓ ప్రైవేటు కంపెనీ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది.స్క్రాప్ చేసిన విమానం భాగాలను ఢిల్లీ నుంచి రప్పించి, రెస్టారెంట్‌ను అసెంబ్లింగ్ చేశామని ప్రాజెక్ట్ మేనేజర్ అనుభవ్ జైన్ తెలిపారు. ఈ ఎయిరోప్లేన్ రెస్టారెంట్లో 70 మంది కూర్చొని భోజనం చేయవచ్చు. 


విమానం రేకులపై ఓపెన్ ఎయిర్ రూఫ్‌టాప్ రెస్టారెంట్ ఉంటుంది. విమానం రెస్టారెంటులో పుట్టినరోజు పార్టీలు, కంపెనీల ఈవెంట్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని విమానం రెస్టారెంట్ మేనేజరు చెప్పారు.ఈ వినూత్న రెస్టారెంటును రెండు మూడు నెలల్లో తెరుస్తామని మేనేజరు జైన్ తెలిపారు. విమాన రెస్టారెంట్ ను చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ రెస్టారెంట్ వల్ల  సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని మేనేజర్ తెలిపారు.

Updated Date - 2022-02-21T15:08:34+05:30 IST