11న కళాభారతిలో ఘంటసాల స్వర నీరాజనం
ABN , First Publish Date - 2021-12-09T05:07:08+05:30 IST
అమర గాయకుడు ఘంటసాల శత జయంతోత్సవాల సందర్భంగా ఈనెల 11న మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఘంటసాల సినీ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఏయూలోని తన చాంబర్లో వీసీ పీవీజీడీ ప్రసాద్రెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు.
పోస్టర్ను ఆవిష్కరించిన ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి
ఏయూ క్యాంపస్, డిసెంబరు 8: అమర గాయకుడు ఘంటసాల శత జయంతోత్సవాల సందర్భంగా ఈనెల 11న మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఘంటసాల సినీ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఏయూలోని తన చాంబర్లో వీసీ పీవీజీడీ ప్రసాద్రెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన కిన్నెర ఆర్ట్స్ థియేటర్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఢిల్లీ తెలుగు అకాడమీ నిర్వహణలో కార్యక్రమం జరుగుతుందని న్యూ రోషన్లాల్ ఆర్కెస్ట్రా అధినేత కె.రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆరోజు సాయంత్రం 5.45 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాసంఘాల ప్రతినిధి కొణతాల రాజు, గాయని ఎం.శశిరాణి, ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చెన్నా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.