ఘనంగా సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి
ABN , First Publish Date - 2020-11-01T07:57:30+05:30 IST
దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు సర్ధార్ వల్లబాయ్ పటేల్ అని మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, ఎన్వైకే వాలంటీర్ ముత్తె మహేష్ అన్నారు
దండేపల్లి, అక్టోబరు 31: దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు సర్ధార్ వల్లబాయ్ పటేల్ అని మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, ఎన్వైకే వాలంటీర్ ముత్తె మహేష్ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం, సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలను తాళ్ల పేటలో శనివారం నిర్వహించారు. శివగణేష్ యూత్ సభ్యులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఉప సర్పంచు తిరుపతి, దయకర్, రాజశేఖర్ పాల్గొన్నారు.
మందమర్రిటౌన్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జ యంతిని శనివారం బీజేపీ నాయకులు నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి డీవీ దీక్షితులు, పైడిమల్ల నర్సింగ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేష్, రంజిత్, రాజశేఖర్, మధు పాల్గొన్నారు.
ఏసీసీ: జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, మల్లయ్య, రాజన్న, పాల్గొన్నారు.
దీక్షా దివస్ను నిర్వహించిన కాంగ్రెస్
ఏసీసీ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వల్లబాయ్ పటే ల్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవల ను గుర్తు చేసుకున్నారు. పటేల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశ ఐక్యమత్యానికి, జాతీయ సమైక్యతకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో చిట్ల సత్యనారాయణ, అబ్దుల్ సత్తార్, భానేష్, పూదరి తిరుపతి, అంకం నరేష్, సదానందం, నల్ల రవి, ఉప్పలయ్య, సంజీవ్ మజీద్, పాల్గొన్నారు.