ఎస్సీ నిధులు మంజూరు చేయించండి
ABN , First Publish Date - 2022-07-02T04:52:08+05:30 IST
ఏపీ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులను మంజూరు చేయించాలని టీడీపీ పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు మూని వెంకటరమణ డిమాండ్ చేశా రు.
మదనపల్లె టౌన్, జూలై 1: ఏపీ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులను మంజూరు చేయించాలని టీడీపీ పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు మూని వెంకటరమణ డిమాండ్ చేశా రు. శుక్రవారం స్థానిక సబ్కలెక్టరేట్ లో ఆర్డీవో ఎంఎస్ మురళిని కలసి విన తి పత్రం అందజేశారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుద్దిళ్ల సుధా కర్తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను కూడా నియమించిని అప్పటి నుంచి ఈ కార్పొరేషన ్లకు నిధులు కేటాయించలేదన్నారు. దీని వలన దళితులకు అందాల్సిన సంక్షేమ పథ కాలు గాలీలో దీపంలా వేలాడుతున్నాయన్నారు. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ రుణాలు కూడా దళితులకు అందడం లేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు విజయ్కుమార్, రెడ్డెప్ప, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.