వాడీవేడిగా నర్సాపూర్‌ మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-07-02T05:04:37+05:30 IST

ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సర్వసభ్యసమావేశం వాడీవేడిగా సాగింది.

వాడీవేడిగా నర్సాపూర్‌ మండల సర్వసభ్య సమావేశం

  ఎంపీడీవో, ఎంపీటీసీ వాగ్వాదం


నర్సాపూర్‌, జూలై 1: ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సర్వసభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయఅశోక్‌గౌడ్‌ హాజరయ్యారు. ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ.. మండల పరిషత్‌కు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, మండల పరిషత్‌కు చెందిన స్థలంలో మున్సిపల్‌ వారు క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నా ఎంపీడీవో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీంతో ఎంపీడీవో మార్టిన్‌, ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.  ఎంపీపీ కలుగజేసుకుని ఇరువురిని శాంతపరిచారు. సర్పంచులకు అధికారులు కనీస మర్యాద ఇవ్వడం లేదని మాడాపూర్‌ సర్పంచ్‌ ఉమ్లానాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని కేవలం రిజిస్ట్రేషన్లు చేయడానికే పరిమితం అయ్యారని ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ విమర్శించారు.

Updated Date - 2022-07-02T05:04:37+05:30 IST