చిక్కాబళ్లాపూర్‌లో పేలుడు...ఆరుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-02-23T14:27:59+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో ఆరుగురు మరణించారు....

చిక్కాబళ్లాపూర్‌లో పేలుడు...ఆరుగురి దుర్మరణం

చిక్కాబళ్లాపూర్‌ (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో ఆరుగురు మరణించారు.చిక్కాబళ్లాపూర్ జిల్లాలో అక్రమంగా క్వారీల్లో వాడేందుకు తీసుకువెళుతున్న జిలెటిన్ స్టిక్కులు పేలి ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్వారీలో వాడేందుకు జిలెటిన్ స్టిక్కులను అక్రమంగా తీసుకువెళుతుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ఘటన స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.ఈ పేలుడులో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. క్వారీయింగ్ కోసం అక్రమంగా జిలెటిన్ స్టిక్కులను తీసుకువెళ్లగా ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక రాష్ట్ర మంత్రి సుధాకర్ చెప్పారు. 


Updated Date - 2021-02-23T14:27:59+05:30 IST