గౌరమ్మ సారె ఊరేగింపు
ABN , First Publish Date - 2021-01-19T06:18:55+05:30 IST
మెయిన్ రోడ్డులోని వేల్పులవీధి గౌరీపరమేశ్వరులకు భక్తులు వివిధ రకాల పిండివంటలతో తయారు చేసిన సారెను సమర్పించారు.
అనకాపల్లి టౌన్, జనవరి 18: మెయిన్ రోడ్డులోని వేల్పులవీధి గౌరీపరమేశ్వరులకు భక్తులు వివిధ రకాల పిండివంటలతో తయారు చేసిన సారెను సమర్పించారు. ఈ ఊరేగింపు మహోత్సవాన్ని ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం సారెను ఇళ్లకు తీసుకెళ్లి కుటుంబీకులు, బంధువులు, పరిసర వాసులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జి.రామ్మూర్తి, ఆలయ కమిటీ ప్రతినిధులు మద్దాల కూర్మారావు, జెట్టి శ్రీనివాసరావు, వి.కృష్ణమోహన్, వైసీపీ నాయకులు జాజుల ప్రసన్నలక్ష్మి, రమేశ్, టీడీపీ నేత శంకర్ల పద్మలత పాల్గొన్నారు.