Guntur: వైసీపీకి ఓట్లు వేయలేదని నివాసాల మధ్య చెత్త నిల్వలు

ABN , First Publish Date - 2022-04-26T17:46:37+05:30 IST

జిల్లాలోని పాత గుంటూరు బాలాజీనగర్‌లో స్థానికులు నిరసనకు దిగారు.

Guntur: వైసీపీకి ఓట్లు వేయలేదని నివాసాల మధ్య చెత్త నిల్వలు

గుంటూరు: జిల్లాలోని పాత గుంటూరు బాలాజీనగర్‌లో స్థానికులు నిరసనకు దిగారు. వైసీపీకి ఓట్లు వేయలేదని కారణంతో నివాసాల మధ్య పెద్ద మొత్తంలో చెత్తను నిల్వ ఉంచారు. చెత్త కుప్పల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ఎన్నిసార్లు చెప్పినప్పటికీ  మున్సిపల్ సిబ్బంది పట్టించుకోని పరిస్థితి. చెత్త కుప్పలకు ఆనుకోని పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బంది తీరుకు నిరసనగా స్థానికులు రోడ్డును బ్లాక్ చేశారు. మున్సిపల్ సిబ్బంది తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చెత్త కుప్పలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-26T17:46:37+05:30 IST