800 కేజీల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-07-25T05:28:13+05:30 IST
విశాఖ జిల్లా నుంచి తెలం గాణకు కంటెయినర్ లారీలో తరలిస్తున్న సుమారు 800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమా చారం.
జంగారెడ్డిగూడెం, జూలై 24: విశాఖ జిల్లా నుంచి తెలం గాణకు కంటెయినర్ లారీలో తరలిస్తున్న సుమారు 800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమా చారం. హైదరాబాద్ వెళుతు న్న కంటెయినర్ను కొయ్యల గూడెం మండలం బైనగూడెం శివారులో శనివారం తెల్లవా రుజామున పోలీసులు అడ్డుకు న్నట్లు తెలిసింది. ముందుగా అందిన సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. గంజాయి తరలిస్తున్న కంటెయినర్తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.