మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడిగా గంగాధరరావు
ABN , First Publish Date - 2021-01-27T06:09:43+05:30 IST
మండల వీఆర్వోల సంఘం అధ్యక్షునిగా అంతకాపల్లికి చెందిన నీటిపల్లి గంగాధరరావు ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సబ్బవరం, జనవరి 26 : మండల వీఆర్వోల సంఘం అధ్యక్షునిగా అంతకాపల్లికి చెందిన నీటిపల్లి గంగాధరరావు ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా బొమ్మ సంతోశ్కుమార్, కార్యదర్శిగా కొమ్ము కొండమ్మ, కోశాధికారిగా యల్లపు రమణ ఎన్నికయ్యారు. సంఘ సభ్యులుగా పావాడ అప్పలరాజు, మచ్చ అప్పారావు, సమ్మింగ కనకారావు, మచ్చ రాము, బాతు శంకరరావులను ఎన్నుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రమాదేవికి సంఘం తీర్మానం కాపీ అందజేసినట్టు నూతన అధ్యక్షుడు గంగాధరరావు తెలిపారు.