కర్ణాటకకు గంజాయి తరలింపు
ABN , First Publish Date - 2021-03-04T07:01:44+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా చింతూరు నుంచి కర్ణాటకకు రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు పట్టుకు న్నారు.
చుంచుపల్లి/బూర్గంపాడు, మార్చి 3: తూర్పు గోదావరి జిల్లా చింతూరు నుంచి కర్ణాటకకు రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు పట్టుకు న్నారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమవేశంలో దీనికి సంబంధించిన వివరాలను కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్రాజు వెల్లడించారు. ప్రదీప్ రాథోడ్, సావన్ రాథోడ్, సావన్ చౌహాన్, బానోతు సతీష్ చింతూరు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద సుమారు నాలుగున్నర క్వింటాళ్ల గంజాయిని కొనుగోలు చేశారు. బ్రౌన్కలర్ పేపర్తో ప్యాకెట్లు కట్టి పది బస్తాల్లో నింపి రెండు కార్లలో తరలిస్తున్నారు. ఎస్హెచ్వో బి.మహేష్ బుధవారం తెల్లవారు జామున భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ కార్లను పట్టుకున్నారు. కొత్తగూడెం, హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోని బీదర్ జిల్లాకు తరలిస్తున్న ఈ గంజాయి విలువ సుమారు రూ.64 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులు నలుగురిని అరెస్టు చేశారు. అనిత రాథోడ్ సూచనల మేరకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు నిందితులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిని కోర్టుకు హాజరుపరుస్తామని ఏఎస్పీ తెలిపారు.