జై బోలో ఉత్సవ కమిటీలకి!
ABN , First Publish Date - 2022-09-18T06:33:19+05:30 IST
తాడినాడలో గణపతి నవరాత్రుల్లో అందిన విరాళాలతో రోడ్డు మరమ్మతులు చేపట్టి శభాష్ అనిపించుకుంటున్నాయి ఆయా ఉత్సవ కమిటీలు.
చవితి విరాళాల సొమ్ముతో రోడ్డుకు మరమ్మతులు
కలిదిండి, సెప్టెంబరు 17: తాడినాడలో గణపతి నవరాత్రుల్లో అందిన విరాళాలతో రోడ్డు మరమ్మతులు చేపట్టి శభాష్ అనిపించుకుంటున్నాయి ఆయా ఉత్సవ కమిటీలు. తాడినాడ నుంచి చినతాడినాడ వరకు 5 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి గోతులు పడి అధ్వానంగా మారింది. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన మండపాల ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధికి నడుం బిగించారు. ఆయా మండపా ల్లో లడ్డూ వేలం, విరాళాల ద్వారా వచ్చిన రూ.2.5 లక్షలతో 3 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతుల పనులు శనివారం ప్రారంభించారు. తాడినాడ – చిన తాడినాడ ప్రధాన రహదారి గోతులు పడి నరకయాతన పడుతున్నామని పాలకులు, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవటంతో విరాళాలతో రోడ్డు మరమ్మతులు చేస్తున్నామని చవితి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.