గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2022-10-03T04:06:08+05:30 IST

మహాత్మాగాంధీ అడుగు జాడల్లో ప్రజలు నడవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. ఆదివారం గాంధీ పార్కులో విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌, ఎమ్మెల్యేతో కలిసి గాంఽధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధనలో గాంధీ పాత్ర మరువలేనిదన్నారు. దేశ ప్రజలకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఆయన స్ఫూర్తి ప్రధాత అన్నారు.

గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడవాలి
కలెక్టరేలో గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 2: మహాత్మాగాంధీ అడుగు జాడల్లో ప్రజలు నడవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. ఆదివారం గాంధీ పార్కులో విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌, ఎమ్మెల్యేతో కలిసి గాంఽధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధనలో గాంధీ పాత్ర మరువలేనిదన్నారు. దేశ ప్రజలకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఆయన స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఆయన పుట్టిన రోజును ప్రపంచ అహింస దినోత్సవం గా ఐక్య రాజ్యసమితి ప్రకటించిందన్నారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లా డుతూ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని తెచ్చిన మహనీయుడన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, భూమేష్‌,  కమి షనర్‌ బాలకృష్ణ, విజిత్‌రావు, కౌన్సిలర్లు ప్రకాష్‌ నాయ క్‌, సత్యం, రవిందర్‌రావు, శేషాద్రి, నారాయణరావు, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు.  

మహాత్మా గాంధీ సుదీర్ఘ పోరాటంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, ఆయన త్యాగాలు చిరస్మర ణీయమని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు అన్నారు. జడ్పీ కార్యాలయ ఆవరణలో గాంధీ చిత్రప టానికి పూల మాల వేసి నివాళులర్పించారు. గాంధీ స్ఫూర్తితో లౌకిక రాజ్యాంగ దేశంగా భారతదేశం ఏర్ప డిందని, ప్రతీ ఒక్కరు ఆ మహనీయుడి ఆశయ సాధ నకు కృషి చేయాలన్నారు. జడ్పీ సీఈవో నరేందర్‌, డిప్యూటీ సీఈవో లక్ష్మినారాయణ, సూపరింటెండెంట్‌ బాలకిషన్‌రావు పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-03T04:06:08+05:30 IST