కమనీయం.. కల్యాణ వైభవం
ABN , First Publish Date - 2021-06-24T04:11:45+05:30 IST
మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
చాముండేశ్వరీ అమ్మవారి ఉత్సవం
ఇందుకూరుపేట, జూన్ 23 : మండలంలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారి కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం విశేష పూజలు, సాయంత్రం ఏరువాక నిర్వహించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త నాగలితో రథం వద్దకెళ్లి, ప్రదక్షిణలు చేస్తూ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవదేవేరులకు పట్టువస్త్రాలు, విశేషమైన పరిమళ వస్త్రాలతో అలంకరించారు. కల్యాణ వేదికను కూడా అలంకరించి స్వామివార్లను ఆసీనులు చేసి కల్యాణ ఉత్సవాన్ని అత్యంత రమణీయంగా జరిపించారు. అర్చకులు అనిల్, సుధీర్స్వామి, దండిగుంట శరత్, ఫణీంద్ర, కోడూరు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.