ప్రతిపక్షంలో Jagan reddy చేసిన ప్రకటనలు ఏమయ్యాయి: గాదె Venkateswararao
ABN , First Publish Date - 2022-07-18T19:26:42+05:30 IST
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని జనసేన నేత గాదె వెంకటేశ్వర రావు విమర్శించారు.
గుంటూరు (Guntur) జిల్లా: రాష్ట్రంలో మద్యం (alcohol) ఏరులై పారుతోందని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు (Venkateswararao) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని లావాదేవిలు డిజిటల్ (Digital)కు అవకాశం ఉందని, ప్రభుత్వ వైన్ షాపు (Wine shop)లలో మాత్రం కేవలం నగదు చెల్లింపులు జరుగుతున్నాయని, మద్యంపై రాష్ట్రంలో నియంత్రణ లేదని ఆరోపించారు. ప్రతిపక్షంలో జగన్ రెడ్డి (Jagan reddy) చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేపల్లె (Repalle)లో మద్యం తాగి చనిపోయిన వారిని పరామర్శించకుండా అడ్డుకున్నారని, మమ్మల్ని అడ్డుకునే పోలీసులు (Police) మద్యం మరణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. ప్రతి వీధిలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వ్యక్తిగతంగా కించపరుస్తున్నారని అన్నారు. విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారని, స్కూల్స్కు చాక్ పీస్లు, డస్టర్లు ఇవ్వలేని దుస్దితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమ పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని గాదె వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు.