అనాథ శవానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-04-16T05:47:57+05:30 IST

అనాథ శవానికి 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేశ్‌ గురువారం అంత్యక్రియలు చేశారు.

అనాథ శవానికి అంత్యక్రియలు
అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తున్న కార్పొరేటర్‌ సురేశ్‌

మల్కాపురం, ఏప్రిల్‌ 15 : అనాథ శవానికి 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేశ్‌ గురువారం అంత్యక్రియలు చేశారు. 40వ వార్డు పరిధి ఏకేసీ కాలనీలోని ఫుట్‌పాత్‌పై ఓ అనాథ మృతి చెంది ఉన్నట్టు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ విషయాన్ని కార్పొరేటర్‌ సురేశ్‌కు తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించి తన సంస్థకు చెందిన పీవీఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుని ఆ మృతదేహాన్ని మల్కాపురం శ్మశాన వాటికకు తరలించి హిందూ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. 

Updated Date - 2021-04-16T05:47:57+05:30 IST