నిధుల్లేక పంచాయతీ ట్రాక్టర్‌ను అప్పగించారు

ABN , First Publish Date - 2022-05-21T06:10:35+05:30 IST

మండలంలోని గోపాలపురం సర్పంచ్‌ బోడ మణె మ్మ గ్రామపంచాయతీ నిధుల లేమి కారణంగా పంచాయతీ ట్రాక్టర్‌ను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వదిలేసి వెళ్లారు.

నిధుల్లేక పంచాయతీ ట్రాక్టర్‌ను అప్పగించారు

మాడ్గులపల్లి, మే 20: మండలంలోని గోపాలపురం సర్పంచ్‌ బోడ మణె మ్మ గ్రామపంచాయతీ నిధుల లేమి కారణంగా పంచాయతీ ట్రాక్టర్‌ను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వదిలేసి వెళ్లారు. ఈ విషయ మై సర్పంచ్‌ను వివరణ కోరగా.. ఐదు నెలలుగా గ్రామపంచాయతీకి నిధులు రాకపోవడంతో గ్రామపాలన భారంగా మారిందని, కనీసం ట్రాక్టర్‌కు డీజిల్‌ పోయించేందుకు కూడా డబ్బులు లేవన్నారు. చేసేదేమిలేక గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను ఎంపీడీవో కార్యాలయం ఎదుట వదిలేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎంపీవోను సంప్రదించగా, గత రెండు రోజులుగా మండలంలోని గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎ్‌సను అమరుస్తున్నామని, అందులో భాగం గా శుక్రవారం ట్రాక్టర్‌ను ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలిపారు. 

Updated Date - 2022-05-21T06:10:35+05:30 IST