ఫేస్‌బుక్‌లో 24 ఏళ్ల యువతితో చాటింగ్.. కలిసేందుకు ప్లాన్.. రెస్టారెంట్‌లో ఆమెను చూసి అతడికి మైండ్‌బ్లాక్..

ABN , First Publish Date - 2021-08-03T19:28:24+05:30 IST

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతితో అతను స్నేహం చేశాడు.. ఆమెతో ఛాటింగ్ చేశాడు..

ఫేస్‌బుక్‌లో 24 ఏళ్ల యువతితో చాటింగ్.. కలిసేందుకు ప్లాన్.. రెస్టారెంట్‌లో ఆమెను చూసి అతడికి మైండ్‌బ్లాక్..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతితో అతను స్నేహం చేశాడు.. ఆమెతో ఛాటింగ్ చేశాడు.. ఆపై మాటలు కలిపాడు.. ఆమె కోరిక మేరకు ప్రత్యక్షంగా కలిసేందుకు కూడా సిద్ధమయ్యాడు.. ఆమె చెప్పిన రెస్టారెంట్‌కు వెళ్లాడు.. తీరా అక్కడకు వెళ్లాక ఆమెను చూసి అతడి మైండ్ బ్లాక్ అయింది.. తనను పట్టుకోవడానికి ఓ మహిళ ఎస్సై వేసిన స్కెచ్ అదని అర్థమైంది.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో మహిళా ఎస్సై ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. 


కొన్ని రోజుల కిందట తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్టు ఓ మైనర్ బాలిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే అతడి గురించిన సమాచారం ఏదీ ఆమె వద్ద లేదు. అతడు ఎలా ఉంటాడనేది తప్ప ఇతర విషయాలేవీ ఆ బాలిక పోలీసులకు చెప్పలేకపోయింది. దీంతో నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఢిల్లీలోని దాబ్రీ పోలీస్ స్టేషన్‌ ఎస్సై ప్రియాంక సైనీ ఈ కేసును చేపట్టారు. ముందుగా ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చాలా మందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు. ఈ రిక్వెస్ట్‌కు నిందితుడి నుంచి స్పందన వచ్చింది. 


అతడే నిందితుడని నిర్ధారించుకున్న తర్వాత ప్రియాంక అతడితో ఛాటింగ్ ప్రారంభించారు. మెల్లగా మాటల్లోకి దించారు. ప్రత్యక్షంగా కలుద్దామని అడిగారు. ఓ రెస్టారెంట్‌లో ప్రియాంకను కలిసేందుకు నిందితుడు అంగీకరించాడు. అలా ప్రియాంక కోరిక మేరకు గత శనివారం ఓ రెస్టారెంట్‌కు వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడి గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. అతడు చాలా మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలింది. అలాంటి నిందితుడిని ఎంతో తెలివిగా ట్రాప్ చేసిన ఎస్సై ప్రియాంకపై ప్రశంసలు కురుస్తున్నాయి. 





Updated Date - 2021-08-03T19:28:24+05:30 IST