స్నేహితుడి భార్య కిడ్నాప్.. అత్యాచారం
ABN , First Publish Date - 2020-05-29T11:26:53+05:30 IST
స్నేహితుడి భార్యకు మాయమా టలు చెప్పి, ఆమెను పుట్టింటి నుంచి తీసుకొచ్చి అత్యాచారా నికి పాల్పడిన వ్యక్తితోపాటు అతనికి ..
ఏలూరు క్రైం, మే 28 : స్నేహితుడి భార్యకు మాయమా టలు చెప్పి, ఆమెను పుట్టింటి నుంచి తీసుకొచ్చి అత్యాచారా నికి పాల్పడిన వ్యక్తితోపాటు అతనికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమా వేశంలో వివరాలు తెలిపారు. ఏలూరు రామకృష్ణాపురంలోని ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్ పల్లి నానిబాబు, మరో డ్రైవర్ స్నేహితులు. నానిబాబుకు అతని భార్యతో మనస్పర్థలు రావడంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒక గదిలో అద్దెకు ఉంటున్నా డు. ఈ క్రమంలో అతని స్నేహితుడి భార్యపై కన్నేశాడు.
ఈ నెల 9న ఆమె ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. స్నేహితుడు కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అద నుగా భావించిన నానిబాబు ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్ చేసి.. ‘నిన్ను నీ భర్త తీసుకురమ్మని చెప్పాడు. నేను కిరాయికి భీమడోలు వచ్చాను’ అని నమ్మబలికాడు. మరో డ్రైవర్ వాసాది కాశీ(31) సహకారంతో ఆమెను కారులో ఏలూరులోని నానిబాబు గదికి తీసుకొచ్చి బంధించి అత్యాచారానికి పాల్ప డ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన ఆమె భర్త వచ్చి భార్యను విడిపించి తీసుకెళ్లాడు. బాధితురాలు త్రీటౌన్ పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మూర్తి కేసు నమోదు చేశా రు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులైన నాని బాబు, కాశీలను అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు.