ఎంతోమంది త్యాగధనుల ఫలితమే స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-07T05:24:02+05:30 IST

ఎంతోమంది త్యాగధనుల ఫలితమే భారతదేశ స్వాతంత్య్రమని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

ఎంతోమంది త్యాగధనుల ఫలితమే స్వాతంత్య్రం
చిన్నకోడూరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చిన్నకోడూరు/సిద్దిపేట క్రైం/మిరుదొడ్డి/వర్గల్‌/దౌల్తాబాద్‌/జగదేవ్‌పూర్‌, ఆగస్టు 6: ఎంతోమంది త్యాగధనుల ఫలితమే భారతదేశ స్వాతంత్య్రమని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేడుకల నిర్వహణపై ఎంపీపీ మాణిక్యరెడ్డి అధ్యక్షతన శనివారం చిన్నకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తిని పెంపొదించేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేడుకలను నిర్వహించాలన్నారు. 8 నుంచి 22 వరకు నిర్వహించే వేడుకల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలో 8 నుంచి 22 వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. గ్రామాల్లో 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు అన్నారు. శనివారం మిరుదొడ్డిలోని రైతువేదికలో మండలస్థాయి, క్షేత్రస్థాయి అధికారులతో స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్గల్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఎంపీపీ జాలిగామ లతారమే్‌షగౌడ్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర స్ఫూర్తిని, దేశభక్తిని పెంపొందించేలా దౌల్తాబాద్‌ మండలంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని ఎంపీపీ సంధ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయలో సర్పంచ్‌, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని డీఆర్డీవో ఏపీడీ కౌసల్యాదేవి కార్యదర్శులు, ఐకేపీ, అంగన్‌వాడీ, ఈజీఎస్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2022-08-07T05:24:02+05:30 IST