రోగుల కోసం ఉచిత ఆటో ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-26T03:58:37+05:30 IST
మాతా శిశు ఆసుపత్రికి వెళ్లే రోగుల సౌకర్యార్ధం కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆటోను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. బుధవారం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఎదుట ఉచితంగా ఏర్పాటు చేసిన ఆటోను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మాతా శిశు ఆసుపత్రికి వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి మాజీ ఎంఎల్సీ ప్రేంసాగర్రావు సహకారంతో ఉచిత ఆటో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏసీసీ, మే 25 : మాతా శిశు ఆసుపత్రికి వెళ్లే రోగుల సౌకర్యార్ధం కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆటోను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. బుధవారం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఎదుట ఉచితంగా ఏర్పాటు చేసిన ఆటోను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మాతా శిశు ఆసుపత్రికి వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి మాజీ ఎంఎల్సీ ప్రేంసాగర్రావు సహకారంతో ఉచిత ఆటో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు వెళ్లే వారికి ఆటో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డులను తిరిగి రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు ఉన్నారని, వారికి ఫ్యాన్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల కోసం చల్లని మినరల్ వాటర్ అందజేస్తున్నామని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, నాయకులు పాల్గొన్నారు.