నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-09-30T14:28:04+05:30 IST

అరియలూరు జిల్లాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆ వ్యక్తి లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామంలో ఉంటున్నాడు.

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

చెన్నై : అరియలూరు జిల్లాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  ఓ కంపెనీలో  పనిచేస్తున్న ఆ వ్యక్తి లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో, అదే ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలికను చాక్లెట్లు కొనిస్తానని చెప్పి  బైక్‌పై తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో మహిళా పోలీసులు బాలికను చికిత్సల నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై  పోక్సో చట్టం కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-09-30T14:28:04+05:30 IST