నలుగురి సస్పెన్షన్.. మరో నలుగురికి నోటీసులు
ABN , First Publish Date - 2021-04-11T05:15:36+05:30 IST
ఆదోని, గోరుకల్లులో అతిసార వ్యాప్తిపై విచారణకు త్రిసభ్య కమిటీలను నియమిస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ శనివారం తెలిపారు.
కర్నూలు, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఆదోని, గోరుకల్లులో అతిసార వ్యాప్తిపై విచారణకు త్రిసభ్య కమిటీలను నియమిస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ శనివారం తెలిపారు. ఆదోని వాటర్ సప్లై ఏఈ రాజశేఖర్రెడ్డి, నీటి విడుదల కార్మికుడు ఈరన్న, పాణ్యం ఈర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్ కుమార్, గోరుకల్లు కార్యదర్శి విజయ భాస్కర్ను సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ఆదోని వాటర్ సప్లై డీఈ, ఈఈ సురేశ్, సత్యనారాయణ, పాణ్యం ఈవోఆర్డీ భాస్కర్రావు, ఆర్డబ్యూఎస్ డీఈ ఉమాకాంత్రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.