గద్వాల బస్టాండ్లో చోరీ
ABN , First Publish Date - 2021-04-13T05:19:14+05:30 IST
జోగుళాంబ గద్వాల బస్టాండ్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఓ మహిళ వద్ద నున్న నాలుగు తులాల బంగారం అపహరణకు గురయ్యింది.
- బస్సు ఎక్కుతున్న మహిళ నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు చోరీ
గద్వాలక్రైం, ఏప్రిల్ 12 : జోగుళాంబ గద్వాల బస్టాండ్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఓ మహిళ వద్ద నున్న నాలుగు తులాల బంగారం అపహరణకు గురయ్యింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. గద్వాల పట్టణానికి చెందిన పద్మావతి ఉగాది పండగకు అత్తగారింటికి వెళ్లేందుకు గట్టు మండలంలోని అరగిద్దకు వెళ్లేందుకు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు బస్టాండ్కు వచ్చింది. గ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా, ఆమె సంచీలో ఉన్న బంగారు ఆభరణాలు మాయ మయ్యాయని గుర్తించింది. తన వెనుక వున్న ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పట్టణ ఎస్ఐ హరిప్రఽసాద్రెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళలను ఆదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు సమాచారం.